13 April, 2026 | 12:23 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

13-04-2026 10:39 AM

సదాశివపేట,కొల్కూర్ గ్రామంలో శనివారం ఆదివారం రెండురోజులు తొలిసారిగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ధనరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు ధనరాజ్ తెలిపారు.

ఈ పోటీలో ఆరు జట్లు పాల్గొని ఉత్సాహంగా పోటీ పడ్డాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆటలను ఆస్వాదించారు. ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ, యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రామ్ రెడ్డి,తెలంగాణ(TYSS)అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ, మాజీ సొసైటీ చైర్మన్ మాణిక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సిల్వరాజ్, మాజీ ఉపసర్పంచ్ సంఘన, వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ పెద్దలు, యువత, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.