calender_icon.png 8 December, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతల కోసమే ఫ్లాగ్ మార్చ్

08-12-2025 07:18:08 PM

- బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్..

బెల్లంపల్లి (విజయక్రాంతి): స్వేచ్ఛయుత ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రవెల్లి, చాకెపల్లి బుధకూర్డ్ గ్రామాలలో సోమవారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ప్లాగ్ మార్చ్ లోఅధికారులు, సిబ్బందితో కలిసి ముఖ్యమైన రహదారులు, గ్రామాలలోని వాడలలో పోలీసు బృందాలు కవాతు చేశాయి. పోలీసుల ప్లాగ్ మార్చ్ ప్రజలకు పోలీస్ లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకం, శాంతి భద్రతపై భరోసా కల్పించాయి.

ఈ సందర్బంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి అక్రమాలు, డబ్బు పంపిణీలు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రత కాపాడేందుకు ప్రత్యేకంగా ప్లాగ్ మార్చ్, పెట్రోలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఓటు విలువైనదనీ, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని రకాల పటిష్టమైన భద్రత, బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛయుతంగా ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్క ఓటరు ఎలాంటి ప్రలోబాలకి, బెదిరింపులకి లోను కాకుండా పోలింగ్ స్టేషన్ కి రావడమే పోలీసుల లక్ష్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ. రవికుమార్, ఏసీపీ బెల్లంపల్లి రూరల్ సీఐ హెచ్. హనోక్, బెల్లంపల్లి సీఐ శ్రీనివాస్ బెల్లంపల్లి-I,బెల్లంపల్లి-II టౌన్, నెన్నెల్, తాళ్ళగురిజాల ఎస్ఐ లు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.