16-10-2024 02:39:49 AM
మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో మహిళల భద్ర తపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగికదాడి జరగటం ప్ర భుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. బాధితురాలికి భరోసా కల్పించాలని, నిం దితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో శాంతిభద్రత లపై హోం మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ ఒక రోజు కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు.