11 August, 2026 | 1:15 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

కొలంబియాలో భారీ భూకంపం

11-08-2026 11:05 AM

కొలంబియా : కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.  భూకంపం ధాటికి డజన్ల సంఖ్యలో భవనాలు శిథిలమయ్యాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకోగా, కనీసం 111 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. కొలంబియా రాజధాని బొగోటాలోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు.  బొగోటాకు 400 కిలోమీటర్ల దూరంలోని చోకోలో భూకంప కేంద్రం ఉందని, భూకంపం ధాటికి పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ నగరాలు ధ్వంసమైనట్లు అధికారలు పేర్కొన్నారు. కొలంబియా వ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీలు దెబ్బతిన్నాయని, ఈ భూకంప ప్రకంపనల కారణంగా 87 మంది గాయపడ్డారని, సుమారు 1,600 భవనాలు దెబ్బతిన్నాయని, అందులో 61 భవనాలు పూర్తిగా కూలిపోయాయని కొలంబియా అధ్యక్షుడు అబెల్లార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు.

కొలంబియా దేశంలో సంభవించిన భూకంపం 21వ శతాబ్దంలో నమోదైన అత్యంత శక్తివంతమైనది. దీని తర్వాత అనేక అనంతర ప్రకంపనలు (aftershocks) సంభవించాయి. ఈ శక్తిమంతమైన భూకంపం తర్వాత 4.8, 2.8 తీవ్రతతో మరో రెండు ప్రకంపనలు వచ్చాయి. దీంతో మనిజాలెస్, క్విబ్డో, కార్టాగో, బ్యూనవెంచురా, పెరీరా, అర్మేనియాలో విమాన సర్వీలు నిలిచిపోయాయి.