calender_icon.png 14 June, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంపుపై దృష్టిపెట్టాలి

14-06-2025 12:10:27 AM

అదనపు కలెక్టర్ వీరారెడ్డి 

యాదాద్రి భువనగిరి జూన్ 13 ( విజయ క్రాంతి )  : జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో   అడ్మిషన్ల  సంఖ్య మెరుగుపరచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి ఆదేశించారు.బీద కుటుంబ విద్యార్థులకు చదువుకుంటేనే పేదరికం పోయి  ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని వివరించా లన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ తో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి సమీక్షించారు. 

ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు  కలెక్టర్ మాట్లాడుతూ... కళాశాల వారిగా ఇచ్చిన అడ్మిషన్ల  టార్గెట్ ను ఎన్ని  అడ్మిషన్లు వచ్చాయని  సమీక్షించారు.  ప్రభుత్వ కళాశాలలో  విద్యార్థుల సంఖ్య పెంచి  వారికి  మంచిగా అర్థం  అయ్యే  విధంగా  బోధన  అందించాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విదార్థి ఇంటికి వెళ్ళి  ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం అందిస్తున్న సకల సౌకర్యాల, బోధన గురించి  తల్లిదండ్రులకు  వివరించి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు.

విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా పేద విద్యార్ధులకు లెక్చరర్  మంచిగా చదువు  చెప్పి  వారి  జీవితాల్లో  వెలుగులు  కురిపిస్తే విద్యార్ధులకు అంతకమించినది ఇంకొకటి ఉండదన్నారు .టీచర్లు విద్యార్ధులకు మంచి చదువు అందిస్తే ఉన్నత స్థాయికి వెళ్లడం ద్వారా  పేదరికం తొలగి పోతుందన్నారు.

విద్యార్థులకు స్లిప్ టెస్ట్ లు పెట్టి అందులో వెనుకబడిన వారిని కేటగిరి వైజ్ గా తీసుకొని వెనుకబడిన విద్యార్థుల పై  ప్రత్యేక శ్రద్ధ  వహించి ప్రతి ఒక్క  విద్యార్ధి పాస్ అయ్యే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు. ఈ  సమీక్షలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.