14-06-2025 12:11:29 AM
తీర్మాణం పేజీలో కింద - పైన వదిలి అవినీతిని కప్పిపుచ్చే తీర్మాణం రాయించిన దృశ్యం
విచారణకు ముందే నిందితులు తప్పించుకునే ప్రయత్నం
బుజ్జగింపులు.. రోదింపులు.. వేదింపులతో రికార్డులు స్వాధీనం
'జాస్' నిధులు అక్రమం కాదు సక్రమమే నిరూపించుకోవడానికి దొంగ తీర్మాణాలతో కుట్ర
వస్తున్న ఆరోపనలు తప్పించుకోడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్న నిందితులు
పెన్ పహాడ్: వైద్య సిబ్బందిపై వేదింపులు.. జాస్ నిధులు ఎలాంటి తీర్మాణాలు లేకుండా ఎంటీ చెక్ లు తీసుకొని స్వంత ఖాతాలోకి మల్లించుకొని ప్రజా సొమ్మును లక్షల్లో దుర్వినియోగం అయ్యాయని.. వీటికి సంబందించి వస్తున్న ఆరోపనలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉన్నత అధికారులు విచారణ చేపట్టిన విషయం విధితమే. గ్రామస్థులు, వైద్య సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు.. మండలంలో ఏఎన్ఎంలపై వేదింపులు, 'జాస్' నిధుల దుర్వినియోగంలో ఆరోపనలు ఎదుర్కోంటున్న డాక్టర్ స్రవంతి, హెచ్ఈఓ చంద్రశేఖర్రాజులపై విచారణ కొనసాగుతున్న క్రమంలో తాము చేసిన తప్పులు బయట పడకుంగా మ్యానేజ్ చేయడానికి ముందస్తుగా దొంగ పథకాలు పన్నారు. ఏకంగా ఆరోపనలు ఎదుర్కోంటున్న హెచ్ఈఓ చంద్రశేఖర్రాజు శుక్రవారం ఫీల్డు విజిట్ పేరుతో మండలంలోని గాజులమల్కాపురం పల్లె దవాఖానాను సందర్శించారు.
తీర్మాణం బుక్ కావాలని సంబందిత ఏఎన్ఎం సైదమ్మను కోరారు. తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో 'డాక్టరమ్మ గారే పంపించారని బుజ్జగింపులు.. రోదింపులు.. చివరికి వేదింపులు.. హెచ్చరికలతో చంద్రశేఖర్రాజు చివరికి తీర్మాణం బుక్ తీసుకొని 'జాస్' నిధులు -డ్రా చేయడానికి.. కావాల్సిన పరికరాలు కొనుగోలు చేయడానికి పాత తేదీలో బలవంతంగా తీర్మాణం రాయించినట్టుగా తెలిసింది. బుక్ లోని తీర్మాణం పేజీలో పైన.. కింద భాగం వదిలి మధ్యలో కొంత తీర్మాణం రాయించడం వెనుక తప్పిదాల మీద తప్పిదాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదీ ముమ్మాటికి గజదొంగలు తప్పించుకునే పనిలో భాగంగానే చెప్పవచ్చని పలువురు మండిపడుతున్నారు.
అలాగే చీదెళ్ల, చెట్లముకుందాపురం పల్లె దవాఖానాలను సందర్శించిగా ఎంఎల్ హెచ్ పీలు ప్రియాంక, ఇందిరలను 'జాస్ 'తీర్మాణాల రికార్డులు ఇవ్వాలని కోరాడు. తమ దగ్గర లేవని నిన్న విచారణ తర్వాత ఇంటి వద్దనే వదిలి వచ్చామని ఎం ఎల్ ఎచ్ పీలు తేల్చి చెప్పారు. రికార్డులు ఇవ్వాలని పలు రకాలగా కోరినా ఇవ్వకపోవడంతో వెనుతిరిగి వెళ్ళిపోయ్యారు చంద్రశేఖరుడు. మహిళా ఉద్యోగస్థులపై వేదింపులు.. ప్రజా సొమ్ము దుర్వినియోగం.. చేసిన కుట్రలు తప్పించుకోవడానికి మరి కొన్ని కుట్రలు చేస్తున్న డాక్టర్ స్రవంతి, హెచ్ఐఓ చంద్రశేఖర్రాజులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎత్తులు.. పై ఎత్తులు చేసినా ఆరోపనలు నిజమని తేలితే వదిలేది లేదు : డీప్యూటీ డీఎంహెచ్ఐ, విచారణ అధికారిని కోటిరత్నం
ఈ విషయమై విచారణ అధికారిని వివరణ కోరగా...ఆరోపనలు ఎదుర్కోంటున్న వారు ఎన్ని ఎత్తులు.. పై ఎత్తులు వేసినా ఆరోపనలు నిజ నిర్ధారణ జరిగితే చట్ట రిత్య చర్యలకు వెనుకాడబోము. హెచ్ఈఓ చంద్రశేఖర్రాజు పల్లె దవాఖానాలకు వెళ్ళింది వాస్తవం. ఆవిషయం నా దృష్టికి కూడా వచ్చింది. బెదిరించి దొంగ తీర్మాణాలు చేసినందుకు కూడా చర్యలు తప్పవు. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతంది. ఎటువంటి ఆందోళన ప్రజల్లో ఉండకుండా విచారణ ఉంటుంది.