22-02-2026 07:17:44 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం ఇంక్లైన్ బస్తీకి చెందిన మిట్టపల్లి కనకయ్య, వీరమ్మల జ్ఞాపకార్ధంగా ఆదివారం కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ లో అమ్మ ఒడి ఎన్జిఒ అన్నదాత ప్రాజేక్ట్ టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదానం చేశారు. ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగుతున్న అన్నదానంలో భాగంగా మిట్టపల్లి కనకయ్య -పీరమ్మ, మిట్టపల్లి రవికుమార్ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు కొడుకులు-కోడళ్ళు మిట్టపల్లి వెంకటస్వామి-యాదమ్మ, కుమారస్వామి -విమాలదేవి, మల్లేష్ -సునీత,
చేరాలు-మమత, మల్లిఖార్జున -వసంత, మనుమలు, మనుమరాల్ల సహకారంతో ఈ అన్నదానం చేశారు. అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ ఈ వారంతో 369కి చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, తొటపల్లి సమ్మిరెడ్డి, మాటూరి వర ప్రసాద్, యం డి యుసుఫ్, చెందుపట్ల లింగమూర్తి పాల్గొన్నారు.