calender_icon.png 4 June, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

02-06-2025 10:32:14 PM

అటవీ అధికారులను చూసి స్మగ్లర్లు పరార్..

సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో ట్రాక్టరులో అక్రమంగా తరలిస్తున్న 15 టేకు కలప దుంగలను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు అటవీ రేంజ్ ఆఫీసర్ రామ కృష్ణరావు(Forest Range Officer Rama Krishna Rao) తెలిపారు. పక్కా సమాచారంతో వెళ్ళిన అటవీ అధికారులను చూసి కలప స్మగ్లర్లు వారి వాహనాన్ని కలప దుంగలను విడిచిపెట్టి పారిపోయారని పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.1 లక్ష ఆరు వేయిలు ఉంటుందని వెల్లడించారు. కలప దుంగలను వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం జిల్లా రేంజ్ కార్యాలయానికి తరలించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నజీర్ ఖాన్, బీట్ ఆఫీసర్లు సంతోష్, భీమేశ్ ఉన్నారు.