29-05-2025 05:55:48 PM
-సుమారు రూ. 30 కోట్ల అభివృద్ధి పనులు ఏమయ్యాయి..
-వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఎందుకు వెళ్లడం లేదు?
-ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు ఎవరూ నిర్మించారు?
-బీఆర్ఎస్ ఆనవాళ్లు చెరపలేవంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధ్వజం..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యేగా రద్దు చేయడమేనా నీ పని అంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao)పై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు(Former MLA Diwakar Rao) ధ్వజమెత్తారు. గురువారం లక్షేటిపేట మున్సిపాలిటీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, మినీ స్టేడియం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న హామీలను మాత్రం నెరవేర్చడం లేదన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులనే స్థానిక ఎమ్మెల్యే పరిశీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారె కానీ కొత్తగా వారు ప్రజలకు చేసిందేమిలేదన్నారు. పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 297 పనులను రూ. 30 కోట్లతో చేపట్టి పూర్తి చేసే క్రమంలో నేడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయా పనులను రద్దు చేయాలని అధికారులను బెదిరించడం ఎంతవరకు న్యాయమన్నారు. ముఖ్యంగా టెండర్లు లేకుండా ఎక్కువ మొత్తానికి పనులు చేపట్టి ప్రతి పనిలో 5 శాతం కమీషన్ తీసుకుంటున్న ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు చరిత్రలో నిలిపోతారని ఏద్దేవా చేశారు. దోచుకో, దాచుకో అనే రీతిలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పనులు ఉన్నాయని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్,అంబేద్కర్ చౌరస్తా నుంచి గోదావరి వరకు రోడ్, పలు సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్,కమ్యూనిటీ హాల్స్ కు నిధులు ఇవన్నీ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేయలేదా? అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు వడ్లలో కోత, కరెంటు కోతలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తులం బంగారం, రూ. 2500, నిరుద్యోగ భృతి, పెరిగిన పెన్షన్, రైతు భరోసా, రైతు భీమా పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రేమ్ సాగర్ రావు చెప్పాలన్నారు.
ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ను వెంటనే అందుబాటులోకి తెచ్చి వ్యాపారులకు మేలు చేయాలన్నారు. ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ ఫుడ్ పోదేటి శ్రీనివ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.