29-05-2025 05:58:35 PM
బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్..
మునగాల: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకోవాలని బీసీ విద్యార్థి సంఘం(BC Students Union) జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్(Ramakrishna Yadav) అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వం దివ్యాంగులకు 35 కేజీల బియ్యం అంతోదయ కార్డ్ పథకాన్ని ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారని ఈరోజు చాలామంది దివ్యాంగులు అంత్యోదయ కార్డులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి దివ్యంగుడికి అంతోదయ కార్డు ఇవ్వాలన్నారు. ప్రతి దివ్యంగుడికి ఇందిరమ్మ ఇళ్ళను ఇవ్వాలని దివ్యాంగుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఉపాధి కోసం చేసుకున్న ప్రతి దివ్యంగుడికి లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజంలో దివ్యాంగులను చిన్న చూపు చూడరాదని వారు పట్ల గౌరవం మర్యాదలు ఉంచాలని ఆయన అన్నారు.