21 April, 2026 | 9:10 PM

తిరుమల తిరుపతి వెంకటేశా

21-04-2026 07:46 PM

మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ అన్నారు. మంగళవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని అనునిత్యం పేద ప్రజల వెంటే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ పేదల పెన్నిధిగా, నీళ్ల ఐలయ్యగా ప్రజల్లో మంచి పేరు వచ్చిందని మరో రెండు పర్యాయాలు ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్లపల్లి  శ్రీరామ దంపతులు దర్శించుకున్నారు.