12-06-2025 12:38:40 AM
అమనగల్లు, జూన్ 11 : అమనగల్లు మండలంలోని మంగళపల్లి గ్రామంలో బుధవారం పో చమ్మ గుడి నూతన నిర్మాణ పనులకు మాజీ ఎం పిటిసి జంగయ్య, ఆలయ కమిటీ సభ్యులు భూ మి పూజ చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా అమ్మవారి ఆలయం నిర్మాణ దశలో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మా ణం కు పూనుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణానికి సబ్ రిజిస్ట్రేషన్ విశ్రాంత ఉద్యోగి కొప్పు జంగయ్య 50,000, గ్రామస్తులతో పాటు, సాయిరాం మెడికల్ షాప్ నిర్వాహకుడు రాము రూ. 5 వేలు తో పాటు గ్రామస్తులు గుడి నిర్మాణంలో భాగం కానున్నారు. కార్యక్రమంలో పుల్లయ్య,సిరసనగాండ్ల పెద్ద యాదయ్య,చిన్న యాదయ్య, కొప్పు చం ద్రయ్య, యాదయ్య లైన్మెన్, కొప్పు నరసింహ, తాన్నయ్య,దుర్గాపురం తదితరులు పాల్గొన్నారు.