24 June, 2026 | 2:24 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ఎఫ్‌పీఐ పెట్టుబడులు

10-06-2024 12:05 AM

గతవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి రూ.16,971 కోట్ల నిధుల్ని వెనక్కు తీసుకున్నారు. కానీ వారు డెట్ మార్కెట్లో రూ. 4,689 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. జూన్ 8తో ముగిసిన వారంలో దేశీయ సం స్థాగత ఇన్వెస్టర్లు రూ.5,578 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడనందున ఈ వారం కూడా ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.