ఉచిత అంబలి పంపిణీ
నిజామాబాద్ మే 2: (విజయ క్రాంతి): ధన్ పాల్ లక్ష్మి బాయి & విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణి కే్ంరద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు.
వేసవి కాలం సందర్బంగా ధన్ పాల్ లక్ష్మి బాయి & విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణి కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి చేపట్టడం జరుగుతుంది. 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుండి మా ట్రస్టు ద్వారా నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని పార్షి రమేష్ (లలిత రైస్ హౌస్) వారి ప్రాంగణంలో నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. లక్ష్మీకాంతరావు పెట్రోల్ పంప్ పెట్రోల్ బంక్ అధినేత దిగంబర్ పవర్, తాజా మాజీ కార్పొరేటర్ బైకన్ సుధా మధు, నగర ప్రముఖులు పున్నయ్య గారు, సదాశివ, రామ స్వామి, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, శిలా శ్రీనివాస్ పాల్గొన్నారు.






