గుండ్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 12: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో ఆదివారం నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నీ నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ యాదవ్, ముక్కర్ల మల్లేష్ యాదవ్, బబ్బురి శ్రీధర్ గౌడ్ లు ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కంబాల జాంగిర్, పాండు, కృష్ణ బ్రదర్స్ ఆధ్వర్యంలో నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ శిబిరంలో 500 మంది పైచిలుకు గ్రామస్తులు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ కో ఆప్షన్ నెంబర్ పేరబోయిన పెంటయ్య, ముక్కెర్ల అండాలు, పేరబోయిన మహేందర్, బండి అనిల్,కంబాల సాయి తేజ్,పబ్బల నరసింహ, కంబాల సాయిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.




