27-06-2025 10:28:02 PM
మణుగూరు,(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మున్సిపల్ కార్యాలయం నందు మండల వైద్యాధికారి డాక్టర్. నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి షుగర్, బీపీ, పరీక్షలు, కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం డాక్టర్. నిశాంత్ కుమార్, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గున్య వ్యాధులు వ్యాపిం చు విధానం, వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.