calender_icon.png 28 June, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్జెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

27-06-2025 10:22:34 PM

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): విద్యార్థులు సబ్జెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిఈసి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఎకనామిక్స్ సబ్జెక్టుపై ఆమె మాట్లాడుతూ సబ్జెక్టు విషయాలపై పూర్తిపట్టు ఉన్నప్పుడే పరీక్షల్లో మంచి సమాధానాలు రాయగలుగుతారని, అంతేగాక విషయపరిజ్ఞానం వస్తుందని, పోటీ పరీక్షల సమయంలో సైతం ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థుల లక్ష్యాలు, వారి విద్యా సామర్ధ్యాలు, తదితర విషయాలను పరిశీలించారు.  అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి జిల్లా కలెక్టర్ చాక్లెట్లను పంపిణీ చేశారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇదివరకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి  శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మార్కెట్ యార్డ్ సందర్శన సందర్బంగా మార్కెట్ యార్డులో సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

దృష్టికి తీసుకురాగా, రైతులకు ఇబ్బందులు కలవకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, ముఖ్యంగా రైతులకు అవసరమే టాయిలెట్ బ్లాక్, మంచినీటి ఆరో ప్లాంట్, రైతులు భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, ఆఫీస్ బిల్డింగ్, డ్రైన్, గోదాము తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అంచనాల రూపొందించి సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా మార్కెట్ యార్డ్ లో ఈ సౌకర్యాలను కల్పించేందుకు గాను ఉన్న అవకాశాలను పరిశీలించారు. సుమారు కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధం చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవిని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్  జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయదేవి, జిల్లా  పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ,మార్కెటింగ్ సెక్రటరీ శ్రీధర్ రాజు, తదితరులు ఉన్నారు.