calender_icon.png 12 June, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు శ్రేయస్సే ఎఫ్‌ఎస్‌సీఎస్ లక్ష్యం

18-05-2025 12:00:00 AM

తుర్కయంజాల్, మే 17 : రైతు శ్రేయస్సే లక్ష్యంగా తుర్కయంజాల్ ఎఫ్‌ఎస్‌సీఎస్ ముందుకెళ్తోందని టీజీ కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. శనివారం తుర్కయంజాల్ కార్యాలయంలో పర్సన్ ఇన్ చార్జ్ కమిటీ సమావేశం జరిగింది. 11మందిని నూతన సభ్యులుగా చేర్చుకు న్నారు.

అలాగే 9మంది రైతులకు రూ.1.25కోట్ల రుణాలు మంజూరు చేశారు. 2024- 25 ఆర్థిక సంవత్సర ముగింపు లెక్కలను ఆమోదించారు. 2025- 2026  ఆర్థిక సంవత్సర ఏప్రిల్ నెల జమా ఖర్చులను ఆమోదించారు. సంఘం సంక్షేమం కోసం, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేయుటకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ రైతులను లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

రైతులకు రుణాలతో పాటు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో రైతుసేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, సభ్యులు చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవరెడ్డి, కుతాడి నర్సింగరావు, వంగేటి లక్ష్మారెడ్డి, కొండ్రు స్వప్న శ్రీనివాస్, చాపల యాదగిరి, శీలం లక్ష్మ్మ, జక్క కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణరెడ్డి, సంఘ సెక్రటరీ వై.రాందాస్ తదితరులు పాల్గొన్నారు.