మాజీ ఎమ్మెల్యే కూతురు అంత్యక్రియలు
పాల్గొన్న ప్రముఖులు
భైంసా డిసెంబర్ 28(విజయక్రాంతి) : ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి కూతురు సులోచన గుండెపోటుతో మృతి చెందగా ఆదివారం ఆమె అంత్యక్రియలు భైంసా మండలంలోని దేగాం గ్రామంలో నిర్వహించారు. ముదురు నియోజకవర్గంలో ఆరుసార్లు విజయం సాధించిన మాజీ మంత్రి స్వర్గీయ గడ్డన్న, కుటుంబీకులు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విట్టల్ రెడ్డి కూతురు కావడంతో పెద్ద ముత్తల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు పిట్టల రెడ్డికి పరామ ర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు వెడుమ బుజ్జి పటేల్ కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.






