19 June, 2026 | 9:02 PM

Breaking News

అంగన్వాడి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్ దున్నా   •   ప్రభుత్వ బడుల బలోపేతానికి సుద్దాల గ్రామ పంచాయతీ వినూత్న చర్యలు   •   ప్రభుత్వ బాలికల పాఠశాల పునఃప్రారంభం   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్   •   కోనరావుపేటలో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి   •   బాధితులకు ఫోన్ల అప్పగింత   •   పంజాబ్ రాష్ట్రంలో పర్యటించిన ఆర్మూర్ లయన్స్ గ్రీన్ ప్రతినిధులు   •   ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఖానాపూర్‌లో ఏజీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ భవిష్య   •   నీటి నిలువ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి   •  

'ఆశ 'స్కీమ్ మెంబర్లుగా గాజుల రామమూర్తి, షాహజాన్ పర్వీన్

19-06-2026 08:09 PM

షాహజాన్ పర్వీన్

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆశ' స్కీమ్ నందు ప్యానెల్ న్యాయవాదులుగా సీనియర్ న్యాయవాదులు గాజుల రామమూర్తి, షాహజాన్ పర్వీన్ లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత నియమించారు. వీరు బాల్యవివాహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాగించెదరు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడం, బాధిత బాలికలకు సహాయము అందించడం,  అవసరమైన న్యాయ పరిరక్షణ కల్పించడం,  అలాగే ప్రజలలో చట్టపరమైన అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి. అవసరమైన సందర్భంలో తక్షణ చర్యలకు సమన్వయం చేయడంలో తమ తమ సేవలను అందించనున్నారు.