6 July, 2026 | 4:17 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

గేట్ ఫలితాలు విడుదల

20-03-2025 01:33 AM
  • విడుదల చేసిన ఐఐటీ రూర్కీ

ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం

న్యూఢిల్లీ, మార్చి 19: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్ 2025) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. గేట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రవేశాలు పొందనున్నారు.

అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన gate2025.iitc.ac.in లేదా goaps.iitr.ac.inలో చెక్ చేసుకోవచ్చు. ఈసారి గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీకి అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1,2, 15, 16వ తేదీల్లో సీబీటీ (కంప్యూటర్ ఆధారిత టెస్టు) మోడ్‌లో రెండు సెషన్లలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 8.26 లక్షల మంది గేట్ పరీక్షకు దరఖాస్తూ చేసుకోగా.. 6.53 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.