calender_icon.png 20 June, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గమ్యస్థానం కంటే రైల్వేస్టేషన్‌కు చేరడమే కష్టం

12-06-2025 01:06:01 AM

- సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు చర్లపల్లి స్టేషన్ కు మళ్లింపు 

- రవాణా సౌకర్యం లేక ప్రయాణికులకు ఇక్కట్లు 

- అరకొర బస్సులు, దోచుకుంటున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు

మేడ్చల్, జూన్ 11 (విజయక్రాంతి): చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రైళ్ల సంఖ్య పెరిగినప్పటికీ రవాణా సౌకర్యం మెరుగుపడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్‌లో అన్ని హంగులతో నూతన రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నందున పలు రైళ్లు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి స్టేషన్‌లకు తరలించారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇటీవల సుమారు రూ.430 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. పలు రైళ్లు మళ్లించడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ సిటీకి దూరం గా ఉండడం వల్ల అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా తయారైంది. రైళ్ల మళ్లింపుతో ప్రయాణి కుల సంఖ్య 30 వేలకు పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా రవాణా సౌకర్యం మెరుగు పడటానికి చర్యలు తీసుకోవాల్సింది. ఆర్టీసీ అధికారులు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని ప్రకటించారు.

కానీ అక్కడ తగినన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కొన్ని రైళ్లు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాయి. చివరి స్టాప్ కూడా ఇక్క డే. ప్రయాణికులు సిటీలోని వివిధ ప్రాం తాల నుంచి ఇక్కడికే రావాలి. కానీ వారు రావడానికి అక్కడి నుంచి బస్సులు లేవు. దీంతో వందల రూపాయలు చెల్లించి క్యాబు లు, అటోలలో రావాల్సి వస్తోంది. తాము వెళ్లే రైలు టికెట్ కంటే క్యాబ్ కిరాయి ఎక్కువ అవుతుందని, గమ్యస్థానం కంటే రైల్వే స్టేషన్ చేరడమే పెద్ద సమస్యగా తయారైందని ప్రయాణికులు అంటున్నారు. 

చర్లపల్లికి మళ్లించిన రైళ్లు ఇవే

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రైలు మళ్లించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో చర్లపల్లి మీదుగా ప్రతిరోజూ 17 రైళ్లు నడిచేవి. 9,000 మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. ఇప్పుడు తిరుపతి లింగంపల్లి కాజిపేట్ లింగంపల్లి- విశాఖపట్నం, సంబల్పూర్ విశాఖపట్నం నర్సాపూర్ వాస్కోడిగామాొోజాస్ దిహ, మచిలీపట్నం నగర్ షిరిడి, విశాఖపట్నం ముంబై రైళ్లను మళ్లించారు. వీటితోపాటు సికింద్రాబాద్ కాగజ్నగర్, సికింద్రాబాద్ రైళ్లు చర్లపల్లి స్టేషన్లోనే ఆగుతాయి. ఇప్పటికైనా ప్రయాణికుల సం ఖ్యకు అనుగుణంగా రవాణా సౌకర్యం మెరుగుపరచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇరుకు రోడ్డుతో ఇబ్బంది 

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇబ్బందిగా తయారయిం ది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్లడానికి కూడా కష్టంగా ఉంది. రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముందే రోడ్డు వెడల్పు చేయాల్సింది. కానీ రోడ్డు వెడల్పునకు ప్రభుత్వం చర్యలు తీసుకో లేదు. రాత్రి సమయంలో రైల్వే స్టేష న్ వెళ్లాలంటే భయపడాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఏమి కొనడానికి కూడా వీలు లేదు. ఇక్కడ పెద్ద దుకాణాలు ఏమీ లేవు.