12-06-2025 01:08:39 AM
రాజేంద్రనగర్/చేవెళ్ల, జూన్ 11: గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనుమతి లేకుండా నిర్వహించిన ఈ వేడుకలో కుటుంబ సభ్యు లతో పాటు సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.
విష యం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రిసార్టులో అకస్మాత్తుగా దాడి చేశారు. మొత్తం 48 మంది పట్టుబడగా అందరికీ గంజాయి టెస్టు లు నిర్వహించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గంజాయి సేవించిన దామోదర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అలాగే అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు సింగర్ మంగ్లీ, త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు. పార్టీలో విదేశీ మద్యం ఏర్పాటు చేసినందుకు మరో కేసు పెట్టారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజే వ్యవస్థను సీజ్ చేశా రు. ఈ పార్టీలో ప్రముఖ నటి దివి, రచయిత కాసర్ల శ్యామ్ పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులపై మంగ్లీ దురుసు ప్రవర్తన
ఎస్వోటీ పోలీసులు పార్టీకి సంబంధించిన విజువల్స్ వీడియో తీస్తుండగా మంగ్లీ దురుసుగా ప్రవర్తించారు. వీడియో తీస్తున్న పోలీసులను ముందు వీడియో ఆపాలని వేలు చూపిస్తూ బెదిరించారు. దీంతో ‘నా డ్యూటీ నన్ను చేయనివ్వండి.. అడ్డుతగలకండి’ అని కానిస్టేబుల్ సమాధానం ఇచ్చా రు. కాగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా పార్టీ ఏర్పాటు: డీసీపీ శ్రీనివాస్
త్రిపుర రిసార్టులో ఎలాంటి అనుమతు లు లేకుండా పార్టీ నిర్వహించారని, ఆ పార్టీలో డీజే, విదేశీ మద్యం ఏర్పాటు చేశారని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం డీసీపీ తన కార్యాలయంలో మీడి యాతో వివరాలు వెల్లడించారు. అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు త్రిపుర రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ, డీజే ఆపరేటర్ మేఘ నాథ్, సింగర్ మంగ్లీపై కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు.