2 July, 2026 | 5:40 PM

దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు

02-07-2026 05:05 PM

బోథ్ . జూలై 2 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన షేక్ ముగిన అలం అనే వ్యక్తి ఇంట్లో గత నెల 28 దొంగతనానికి పాల్పడిన ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు బోత్ ఎస్సై వి పురుషోత్తం తెలిపారు. గత నెల 28న ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లి తిరిగి వచ్చిందని అయితే వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఎస్సై కేసు నమోదు చేసుకొని సాంకేతిక ఆధారాలను ఇతర సమాచారాన్ని సేకరించి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు ఇప్ప పరమేశ్వర్ ధ్యానంగా పోశెట్టి లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు ఎస్సై వివరించారు