calender_icon.png 18 June, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి

18-06-2025 12:19:45 AM

భద్రాద్రి కొత్తగూడెం/ఆళ్లపల్లి, జూన్ 17 (విజయ క్రాంతి); గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే తక్షణమే పోలీస్ వారికి సమాచారం అందించాలని టేకులపల్లి సిఐటి సురేష్ అన్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఓఎస్డి నరేందర్ సూచనలతో మంగళవారం అళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారం,పెద్ద వెంకటాపురం గుత్తి కోయ గ్రామాలలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రాగ్రామ్ ను నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని,అట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా కల్పించారు.

తెలియని వ్యక్తులు తమ తమ గ్రామాలలోకి ప్రవేశిస్తే వారికి ఆశ్రయం కల్పించొద్దని సింగారం,వెంకటాపురం గుత్తికోయ గ్రామస్తులకు తెలియజేశారు.ఇటీవల వరుస ఎదురు కాల్పులు,అరెస్టుల వలన అసాంఘీక శక్తులు తమ రక్షణ కోసం చత్తీస్గడ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున గుర్తు తెలియని వ్యక్తులు, మావోయిస్టు సానుభూతిపరులు మీ గ్రామానికి మీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కనిపిస్తే స్థానిక పోలీసులకు , 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి తగిన నగదు పారితోషకం ఇవ్వడం జరుగుతుందన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని వారికి దూరంగా ఉండాలని తెలియజేశారు. యువత మంచిగా చదువుకొని ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించాలని,క్రీడల్లో రాణించాలని తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎస్త్స్ర ఎం.సోమేశ్వర్  టీజిఎస్పి సిబ్బంది , స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొనడం జరిగినది.