25-06-2025 05:06:21 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 28 నుంచి జూలై 3వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ పట్టణంలో జరిగే HFI 54వ సీనియర్ మహిళల హ్యండ్ బాల్ పోటీలకు తెలంగాణ మహిళా హ్యాండ్ బాల్ జట్లు కోచ్ గా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి పాఠశాలలో పిఈటి గా సేవలు అందిస్తున్న గోగర్ల సాయి ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అధ్యక్షుడు గొనె శ్యామ్ సుందర్ రావు(District Handball President Gone Shyam Sundar Rao), ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు.
NIS Certificate Course చేసిన సాయి గతంలో కూడా రాష్ట్ర జట్టుకు, జిల్లా జట్లకు కోచ్ గా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందారు. సాయి రాష్ట్ర జట్టు కోచ్ గా ఎంపికకావడం పట్ల ఆసిఫాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ ఇంచార్జి ప్రెసిడెంట్ అరిగేలా మల్లికార్జున్ యాదవ్, DYSO & DD రమాదేవి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ బండ మీన రెడ్డి, కోచ్ లు అరవింద్, రాజలింగు, సాయి, సాగర్, తిరుమల, రవి, సీనియర్ క్రీడాకారులు, తదితరులు అభినందించారు.