28 June, 2026 | 9:53 AM

జనపనార రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

23-01-2025 01:09 AM

కనీస మద్దతు ధర రూ.5,650కి పెంపు

న్యూఢిల్లీ, జనవరి 22: 2025  సీజన్‌కు సంబంధించి క్వింటాల్ ముడి జనపనార కనీస మద్దతు ధర రూ.5,650కు పెంచింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం స మావేశమైన కేంద్ర క్యాబినేట్ ఈ మేరకు ని ర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా జనపనార ఉత్పత్తిపై సగటు ఖర్చు కన్నా రైతులకు 66.8శాతం ఎక్కు రాబడి లభిస్తుందని మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్‌ను మరో ఐదు సంవత్సరాలు పొడగించింది.