4 May, 2026 | 4:13 AM

రేవంత్‌తో గోపీచంద్ భేటీ

09-01-2025 12:00 AM

హైదరాబాద్: తెలంగాణలో స్పోర్ట్స్ యునివర్సిటీ ఏర్పాటుతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు క్రీడా పాలసీలు, చర్యలు తీసుకోవడం శుభ పరిణామమని బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు.  బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి తన వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా గోపీచంద్‌కు రేవంత్ హామీ ఇచ్చారు.