21 March, 2026 | 1:35 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

ఘనంగా కాష్యపిరెడ్డి జన్మదిన వేడుకలు

21-03-2026 12:05 AM

మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్‌రెడ్డి

కుషాయిగూడ మార్చి 20 (విజయ క్రాంతి) : డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) శుక్రవారం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి కుమార్తె పజ్జు రి కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆడంబరాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా, సేవా కార్యక్రమాలతో ఈ వేడుకలను జరపడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు అండగా పీఎంఆర్ సేవా సంస్థ: ఈ సందర్భంగా పీఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులందరికీ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన నీటి సీసాలను (వాటర్ బాటిల్స్) పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పజ్జురి పావని మణిపాల్ రెడ్డి తన కుమార్తె కాష్యపి రెడ్డితో కలిసి విద్యార్థులకు వీటిని అందజేశారు. కాష్యపిరెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పా ఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పీఎంఆర్ సేవా సంస్థ ప్రతినిధులు, మట్ట రాజేశ్వర్ రెడ్డి, కరిపే ప్రవీణ్ వంజరి, పొద్దుటూరి గోవర్ధన్, నాగేశ్వర్ రెడ్డి, సింగం రాజు, సంజీవ రెడ్డి, ప్రకాష్, అరుణ్, ఉమేష్, రాజేష్, సాయి నితీష్, రామ్, నిరుపం, సాయి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.