calender_icon.png 24 June, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలి

24-06-2025 12:14:25 AM

  1. సర్వే చేయించి పెన్సింగ్ వేసి స్థలం బోర్డులు పెట్టాలి

ఆర్టిఐ చట్టం యాక్టివిటిస్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు జి.రవికుమార్

జిల్లా కోశాధికారి మహేందర్ నాయుడు

కొత్తకోట జూన్ 23 : మదనాపురం మండలంలో వివిధ గ్రామాలలో కబ్జా కు గురవుతున్న ప్రభుత్వ భూములు బంజారా భూములు,ఇనాం భూములు,గ్రామ కంఠం భూములు,మిగులు భూములు, రెవిన్యూ భూములు,దేవాలయ భూములు, వాక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు,అసైన్డ్ భూములు,గోమల భూములు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు చేస్తున్నారని,కబ్జా గురి అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని సమాచార హక్కు చట్టం-2005 యాక్టివిటిస్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు జి.రవికుమార్,జిల్లా కోశాధికారి మహేందర్ నాయుడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఆయా శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.భవిష్యత్ తరాల అవసరాలకు ప్రభుత్వ భూమి ఎంతో అవసరం అని,ప్రభుత్వ భూములు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో పూర్తి గా సర్వే చేసి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.మండలంలో ఎక్కడా ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్టర్లో చెక్ చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ భూములను సర్వే చేయించి వాటి అన్నిటికీ ప్రభుత్వ పెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలం అని బోర్డు లు కూడా పెట్టాలని కోరారు.