calender_icon.png 24 June, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూడెం ప్రజల కరెంట్ కష్టాలు తీరేది ఎన్నడు!

24-06-2025 12:14:29 AM

జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (విజయ క్రాంతి)కొత్తగూడెంనియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్తు కోతలను నివారించాలని యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని భజన మందిరం ఎదురుగా గల విద్యుత్ డివిజన్ ఇంజనీరు కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి చెవిలో పూలు, చేతిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కొత్తగూడెంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయని చంటి పిల్లలు,ముసలి వారు ఎండలకు ఉక్కపోతలకు బయట ఉండే పరిస్థితులు లేవని ఇంట్లో ఉందామనుకుంటే పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోజుకు 20 సార్లకు పైగా అప్రకటిత విద్యుత్తు కోతలు విధిస్తున్నారని గతంలో నియోజకవర్గంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు లేద ని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే విద్యుత్తు అధికారులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విద్యుత్తు కోతలను నివారించాలని లేని యెడల భవిష్యత్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,జిల్లా ఉపాధ్యక్షుడు వీరు నాయక్,నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవి కుమా ర్, తడికమల్ల దిలీప్,సంజీవ్,బరిగడి అచ్ఛయ్య,శరత్, దనంజయ్తదితరులు పాల్గొన్నారు.