14-06-2025 12:07:49 AM
కరీంనగర్, జూన్ 13 (విజయ క్రాంతి): అధికారుల బదిలీలు, ఇంచార్జి మంత్రి మా ర్పు ద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతుంది. రా ష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఇందులో కరీంనగర్ కు సంబంధిం చి ప్రస్తుతం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా వ్యవహరిస్తున్న ప్రపుల్ దేశాయ్ ని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గా మార్చి పోస్టింగ్ ఇచ్చింది.
కమిషనర్ గా పనిచేసిన చాహత్ బాజ్ పాయ్ని గ్రేటర్ వరం గల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేసింది. అక్కడ కమిషనర్ గా పనిచేస్తున్న అశ్విని తానాజీ వాకడేను కరీంనగర్ అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా ప్రభుత్వం నియమించింది. అశ్విని తానా జీ వాకడేకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
ఇంచార్జి మంత్రి మార్పు...
కరీంనగర్ కు నిన్నటి వరకు ఇంచార్జి మంత్రిగా ఉన్న రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం మార్చింది. ఆయన స్థానం లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును నియమించింది. ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయడంతోపాటు కరీంనగర్ అసెంబ్లీ నియోకవర్గం తోపాటు మరికొన్నిచోట్ల కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య సమన్వయలోపంతో ఇందిరమ్మ ఇళ్ల లాంటి పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ పడుతుండడంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఇంచార్జి మంత్రిని మార్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తుమ్మల నాగేశ్వర్రావు ఈ వారం రోజుల్లో జిల్లాకు చేరుకుని ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించేఅవకాశంఉంది.