calender_icon.png 14 June, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ప్రొసీడింగ్.. రెండు అనుమతులు?

14-06-2025 12:11:51 AM

  1. ప్రభుత్వానికి జేజే డెవలపర్స్ టోకరా
  2. వినియోగదారులకు కుచ్చుటోపీ 
  3. 70 మంది నుంచి రూ.14 కోట్లు వసూలు
  4. లబోదిబో మంటున్న బాధితులు
  5. ఒకే ప్రొసీడింగ్‌తో వేరా నుండి రెండు అనుమతులు 

నిజామాబాద్ జూన్ 13:(విజయ క్రాంతి) : నిజామాబాద్ నగర శివారులో జేజే డెవలపర్స్ పేరా వెంచర్ ను ప్రారంభించిన కొందరు వ్యక్తులు ప్లాట్లు అమ్మకానికి పెట్టారు . జాతీయ రహదారి కి దగ్గరలో నీ మాధవ్ నగర్ లో ప్లాట్లు ఉండడంతో మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపి తమ వద్దకు వచ్చి  జే జే డెవలపర్స్ ప్లాట్లు కొనడానికి డబ్బులు చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేశారు ఇంతవరకు  బాగానే ఉంది.

సదరు ప్లాట్ల తాలూకు భూమి కొన్న వ్యక్తులు జేజే డెవలపర్స్ శ్రీనివాస్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి రవి చంద్రారెడ్డి ఇతర ఇద్దరు వ్యక్తులు ప్లాట్ల కొనుగోలుకై డబ్బులు తీసుకొని కొంతమందికి ప్లాట్లు పొజిషన్ ఇచ్చారు. జేజే డెవలపర్స్ పేరా పట్టే దారి నుంచి భూమి కొన్న మనీ సదరు డెవలపర్స్ ప్లాట్లు కొనుగోలుదారుల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేశారు.

తీరా జేజే డెవలపర్స్ భాగస్వాములు పట్టేదారకు డబ్బులు చెల్లించకపోవడంతో పట్టేదారు ఒత్తిడి తేవడంతో ఫైనాన్సర్లను ఆశ్రయించి 14 కోట్ల 75 లక్షల అప్పు తీసుకున్నా మనీ ప్లాట్లు కొనుగోలుదారులకు చెప్పారు. ఆ అప్పు తాలూకు నేరుగా పట్టేదారు నుండి ఫైనాన్స్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. జేజే డెవలపర్ పేరు మీద ఒక ప్రొసీడింగు అదే నెంబర్తో మరొక ప్రొసీడింగ్ అవని టౌన్షిప్ ఇందూరి పేరా మరో ప్రొసీడింగు ప్రోసిడింగ్ నెంబర్ మాత్రం ఒకేలా ఉంది.

బిల్డర్ పేర రిజిస్ట్రేషన్ చేసిన అదే భూమిని ముందుగా 72 ప్లాట్లు 72 మందికి విక్రయించారు పూర్తిగా డబ్బులు వసూలు చేశారు దాదాపు 14 కోట్లకు పైగానే డబ్బులు వసూలు అయ్యాయి. ప్లాట్లు కొనుగోలుకై చెల్లి డబ్బులు చెల్లించిన వారు మాత్రం డెవలపర్స్ ఫైనాన్స్ పట్టేదారు అంతా కలిసి తమను ఇబ్బందుల గురి చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై అనుమతులకై వేరా నుంచి తెచ్చిన ప్రొసీడింగ్స్ ని చూస్తే అసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.

డెవలపర్స్ అయినా మంథని కరుణాకర్ రెడ్డి మర్రి గోపీచంద్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ రెడ్డి మర్రి రవిచంద్రారెడ్డి మరో భాగస్వామి మంథని ధనుంజయ్ రెడ్డి లకు 72 ప్లాట్ లకు గాను 12 కోట్లకు పైగా డబ్బులు చెల్లించాం. ముందుగా మాకు 6,500 మొదలుకొని ప్లాట్లను బట్టి 12 వేల వరకు గజానికి చొప్పున డబ్బులు తీసుకొని అగ్రిమెంట్లు రాసి ఇచ్చారు. తీరా భూమిని ఫైనాన్సర్ల పేరా రిజిస్ట్రేషన్ చేయించారు.

ప్లాట్లకై చెల్లించిన డబ్బుల తాలూకు రసీదు ఇచ్చింది జేజే డెవలపర్స్ పేరా వెంచర్ పర్మిషన్ ఇందూరు అవనిపై తీసుకున్నారు.  ఇప్పుడు డబ్బులు చెల్లించిన మా ఫ్లాట్ల తాలూకు భూములలో శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్స్ . రంజిత్ రెడ్డి సిహెచ్ శ్రీహరి పి చంద్రశేఖర్ ఎం వెంకటరమణ ఎం వీరేశం వి సురేందర్ ఎం సంతోష్ జీ రంగయ్య పి కాశీనాథ్ ఇందూరి నరేష్ అండ్ అదర్స్ పేరా బోర్డుని పెట్టారు.

దీన్ని బట్టి చూస్తే డెవలపర్స్ పట్టేదారు ఫైనాన్సర్స్ అంతా కుమ్మక్కైనట్టు కనిపిస్తోంది.  దాదాపు 80 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి. టౌన్ షిప్ వెంచర్ డెవలప్మెంట్ కై రేలా నుండి పర్మిషన్లు తెచ్చిన పత్రాలను చూస్తే అన్నింటికీ ప్రొసీడింగ్ నంబర్స్ ఒకేలా ఉన్నాయి. ఒకే ప్రొసీడింగ్ నంబరు P 03100005925 తో  రేరా మూడు ప్రస్టిడింగ్స్ ఉన్నాయి ఇది ఏలా సాధ్యం ఔతుంది.

ఈ విషయమై పూర్తి దర్యాప్తు జరగాలి అప్పుడే వాస్తవాలు నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న స్థిరాస్తి వ్యవహారాలు లావాదేవీల వసూళ్లు మోసాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ వెంచర్లు ఎలా వేశారు అనుమతులు ఎక్కడ నుండి వచ్చాయి అసంపూర్తిగా డాక్యుమెంటేషన్ తో వెంచర్లు ఎలా మొదలుపెట్టారు వెంచర్లు పెట్టడానికి అర్హత లేని వ్యక్తులు ముందుగా ఆస్తి తమ పేరు లేకుండా ప్లాట్లుగా ఎలా విక్రయించారు అందుకుగాను ప్లాట్లకై వసూలు చేసిన డబ్బులు  తాలూకు రసీదులు ఎలా ఇచ్చారు...

వీటికి పక్కా లెక్కలు ఉన్నాయా...? డెవలపర్స్ కు పట్టే దారి నుంచి తీసుకున్న భూమి తాలూకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా..? ప్లాట్లు అమ్మడానికి పట్టేదారు డెవలపర్స్ కి అనుమతి ఇచ్చాడా...? నిజంగా పట్టేదారుకు డబ్బులు చెల్లించడానికి జై జై డెవలపర్స్ నిర్వాహకులు క్యాన్సర్లను ఆశ్రయించారా సందేహాలకు జవాబు విచారణలో తేలనుంది.  ప్లాట్లకై జే డెవలపర్స్ కి డబ్బులు చెల్లించిన కొనుగోలుదారులు మాత్రం దిక్కుతో సంస్థితిలో ఉన్నారు.

తిప్పించుకుంటున్నరు

నేను విద్యుత్ శాఖలో పనిచేసే రిటైర్డ్ అయ్యాను నేను పొదుపు చేసుకున్న డబ్బులతో పాటు నా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులు పెట్టి జేజే డెవలపర్స్ నిర్వాహకులైన రవిచంద్ర రెడ్డి కర్ణాకర్ రెడ్డి కలిసి జేజే డెవలపర్స్ లో ప్లాట్లు రవిచంద్ర రెడ్డి ద్వారా నన్ను సంప్రదించారు రెండు ప్లాట్లు 27 లక్షల రూపాయలు వారికి చెల్లించాను 202+202=404 గజాల జాగా నా బిడ్డ కొరకు నా కొరకు ఖరీదు చేశాను.  గాను పూర్తిగా 27 లక్షల రూపాయలు చెల్లించారు 89,90 నంబర్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తానని నాలుగు సంవత్సరాలుగా తిప్పుతున్నారు 

 డి నారాయణ,  విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి

ఇబ్బందులకు గురిచేస్తున్నారు

నేను విద్యాశాఖలో పని చేశాను ప్రిన్సిపాల్ గారి అయ్యాను 158 గజాల ప్లాటుకై జే డెవలపర్స్ మాధవ నగర్ లోని వారి వెంచర్లో ఒక 158 నెంబర్ ప్లాట్ ని నాకు ఇచ్చారు అందుకుగాను 14, లక్షల 50 వేల రూపాయలు చెల్లించాను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటూ జె జె డెవలపర్స్ భాగస్వాములైన కర్ణాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధనుంజయ రెడ్డి రవిచంద్ర రెడ్డి గోపీచంద్రారెడ్డి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయించలేదు.  రిటైర్డ్ అయిన నన్ను నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విషయమై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ పోలీస్ శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేశాను  

 కదం శివాజీ, రిటైర్డ్ ప్రిన్సిపల్

నా గుడిసెను తొలగించారు

నేను నా కొడుకు పెళ్లి చేశాను నా కోడలు నీలిమ పేరా 207 గజాల ప్లాట్‌కై జే జే డెవలపర్స్ అమ్మకా నికి పెట్టిన ధర్మారం లోని వెంచర్లో 107 నంబర్ ఫ్లాటు కై 18 లక్షలు చెల్లించాను. ప్సనా రవిచంద్ర రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు ప్లాటు పొజిషన్ నాకు ఇచ్చారు. నేను 107 ఫ్లాట్లో గుడిసె వేసాను. కానీ ఫైనాన్సర్‌గా చెప్పబడుతున్న రంజిత్ రెడ్డి అతని అనుచరులు నా గుడిసెను తొలగించారు. డెవలపర్స్ నిర్వాహకులైన రవి చంద్రారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఫైనాన్సర్స్ అంతా కలిసి నాటకం ఆడుతున్నారు. జిల్లా యంత్రాంగం మెయింటెనెన్స్ స్పందించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను 

 హరిచంద్, ఉద్యోగి