11-06-2025 12:47:06 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జూన్ 10(విజయ క్రాంతి)ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ గ్రాండ్ లో జరిగిన వేములవాడ నియోజకవర్గం సోషల్ మీడియా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా గెలవడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ల పాత్ర మరువలేనిదనీ తెలిపారు..
అనాడు పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వం పై ,దొరల పాలనకు చరమ గీతం పడండి అని చెప్పిన సందేశాన్ని గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికీ చెరవేసింది సోషల్ మీడియా వారియర్స్ అని గుర్తు చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మందుకు పోతున్న సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు సోషల్ మీడియా వారియర్స్ చెరవేయాలని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ స్కిల్ యూనివర్సిటీ, స్పోరట్స్ యూనివర్శిటీలు తెరిస్తే బిఆర్ఎస్ పార్టీ దుబాయ్ కేంద్రంగా వాట్స్ అప్ యూనివర్సిటీలను తెరిచి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏప్పటికప్పుడు తిప్పికొట్టాలని పేర్కొన్నారు.కష్టపడ్డవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు..
దానికి నిదర్శనమే సోషల్ మీడియా వారియర్స్ గా ఉన్న వారికి మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ లుగా నియమించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జ మల్లేష్, జిల్లా కోకన్వీనర్ కనికరపు రాకేష్, వేములవాడ పట్టణ కన్వీనర్ ఎర్ర శ్రావణ్, వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,అన్ని మండలాల కోఆర్డినేటర్లు, గ్రామ శాఖ కోఆర్డినేటర్లు తదితరులుపాల్గొన్నారు.