11-06-2025 12:48:37 AM
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్, జూన్ 10 (విజయ క్రాంతి): డా.భూంరెడ్డి మరణం తీరని లోటని, వైద్య వృత్తితో పాటు సామాజిక సేవకై వారి జీవితం మొత్తం అవిరళ కృషి చేశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శా సనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం డాక్టర్ భూంరెడ్డి పార్థివ దేహానికి మంత్రి నివాళులర్పించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూంరెడ్డి ఏం ఎస్ చదువుతున్న రోజుల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో గోల్ మెడలిస్ట్ పట్టా అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా అందుకొని ఆరోజుల్లో అనారోగ్య కారణాలతో జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చేరిన సమయంలో డా.భూంరెడ్డిని స్వయంగా పిలిపించుకుని వైద్య సేవలు పొందడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.
మా తండ్రి శ్రీపాద రావుకు కూడా మం చి మిత్రులని అన్నారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి కుమారుడు సూర్య నారాయణ రెడ్డి ని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డిఉన్నారు.