24-04-2025 12:37:17 AM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, ఏప్రిల్ 23 ( విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లా కంది మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో కొత్త గా నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులో ఉందన్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుకోవాలని, వారికి ఏకరూప దుస్తులు పుస్తకాలుఅందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రవీంధర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.