చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
17-03-2026 03:49 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో మొరం తవ్వకాలు చేపడుతున్న చెరువును మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డపై వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైతే కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. చెరువు శిఖం భూములు మొరం తవ్వకుండా రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ మైనింగ్ అధికారి హరిప్రసాద్ మండల రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు




