పదవ తరగతిలో 100% ఫలితాలు
17-03-2026 04:01 PM
ఐటీడీఎ డీడీ అంబాజీ నాయక్
నిర్మల్,(విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పది ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రాస్తున్న విధానంపై అడిగి తెలుసుకున్నారు. మిగతా పిల్లలకు కూడా మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజమౌళి తుకారం కోఆర్డినేటర్ శివాజీ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.




