26-06-2025 12:23:07 AM
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం, జూన్ 25 (విజయ క్రాంతి):అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.మంత్రివర్యులు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీ షనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట ప్రాంతంలో టి.యు.ఎఫ్. ఐ.డి.సి. నిధులు 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట ప్రాంతంలో అవసరమైన విద్యుత్ లైన్లు వే సేందుకు నిధులు చెల్లించామని, స్థానిక అధికారులు దగ్గరుండి సరిగ్గా పని చేయించుకోవాలని అన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.6వ డివిజన్ లో ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం చేపట్టాలని అన్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన పనులు వానలు రాకముందే పూ ర్తి చేయాలని, డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, పబ్లిక్ హెల్త్ ఇఇ వి.రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం. ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బ న్ తహసిల్దార్ సైదులు, కార్పొరేటర్ లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.