26-06-2025 12:22:13 AM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాం తి): మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డు ల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది.
గతేడాది జనవరి 31తో రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిందని, ఏడాదిన్నర అయినా తిరిగి ఎన్నికల నిర్వహించడం లేదని పలువురు మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్ర యించి మొత్తం ఆరు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై న్యాయస్థానం ఇప్పటికే అనేకసార్లు విచారించింది. ఈ క్రమంలో న్యాయస్థానం పిటిషనర్లతోపాటు రాష్ట్ర ప్ర భుత్వం, ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదుల వాదనలు విని శనివారం తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం తీర్పు ను వెలువరించింది.
పిటిషనర్ల వాదన..
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. 2024 జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిందని, దీంతో సర్పంచ్ల స్థానంలో సర్కార్ ప్రత్యేక అధికారులను నియమించిందని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల నియామకం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల కు విరుద్ధమని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు.
ప్ర త్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్ర జల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొ న్నారు. రాష్ట్ర ఆర్థిక సం ఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచ్లు సొంత ని ధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారని తెలిపారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని ధర్మాసనానికి విన్నవించారు.
అనేక పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావటం లేదని పేర్కొన్నారు. ఈసీ, సర్కార్ వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, లేదంటే పాత సర్పంచ్లకే పాలనా బాధ్యతలు అప్పగించాలని వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణలో జాప్యం తగదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాదన..
రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ఖాన్ తన వాదనలు వినిపిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందని, పంచాయతీల్లో వార్డులు విభజించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు.
అం దుకు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఫిబ్రవరిలో ఎలక్షన్ నిర్వహిస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఎన్నికలు ఎందు కు నిర్వహించలేదని ప్రశ్నించారు. అందుకు అడ్వొకేట్ జనరల్ సమాధానమిస్తూ.. కులగణన చేపట్టడటం వల్లనే జాప్యం జరిగిందని న్యాయమూర్తికి వివరించారు. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు నెల రోజులు గడువు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల కమిషన్ వాదన..
ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది విద్యాసాగర్ తన వాదనలు వినిపిస్తూ.. స్థాని క సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, రిజర్వేషన్లు ఖరారు కాగానే ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభిస్తుందని తెలిపా రు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమో దం తెలిపాక కూడా నిర్వహణకు రెండు నెల ల సమయం పడుతుందన్నారు. పిటిషనర్లు, సర్కార్, ఈసీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. నెల రోజుల్లో వా ర్డుల విభజన పూర్తి చేసి, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
సర్కార్కు అనేక సవాళ్లు..
హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారుతో పాటు డివిజన్లు, వార్డుల విభజన చేయాల్సి ఉన్నది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే బీసీలకు 42శాతం రిజర్వేష న్లు అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రెండు బిల్లులు చేసి అసెంబ్లీలో ఆమోదం తీసుకుం ది. వాటికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం రెండు బిల్లలు కేంద్రం పరిధిలో పెండింగ్లో ఉన్నాయి. కానీ, సీఎం రేవంత్రెడ్డి లోకల్ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసి తీరుతామని హామీ ఇచ్చారు.