26-05-2025 01:49:51 PM
మహదేవపూర్, (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పుష్కరాల చివరిరోజైనా సోమవారం రోజున పుష్కర స్నానం ఆచరించి సరస్వతి మాతను దర్శించుకొని శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అధికారులు కూడా సమన్వయంతో పని చేస్తూ పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందని తెలిపారు.