calender_icon.png 14 May, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

25-03-2025 12:13:52 AM

ఆర్డీవోకు వినతి 

కోదాడ, మార్చి 24: రైతులు పండించిన రబీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఆర్డీవో సూర్యనారాయణకు సోమ వారం వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే 10 శాతం పంట పొలాలను రైతు లు కోసుకున్నారని ఇంకా పది రోజులలో 70% పంటలు కోతకు వస్తాయని వాటిని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు వేలువోలు చిట్టిబాబు, రైతులు కనగాల శేషగిరి కనగాల పుల్లారావు, మల్లె బోయిన వెంకటేష్ బాబు, సామినేని రమేష్, వంకాయ లపాటి లక్ష్మయ్య, సజ్జ వెంకటేశ్వరరావు, వంకాయలపాటి లక్ష్మయ్య, వై రామ్మూర్తి, జి నాగభూషణం, గిరి, నవీన్ పాల్గొన్నారు.