31-05-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 30 (విజయక్రాంతి): జిల్లాలో ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకా రం రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కౌటాల మండలం సాండ్ గాం, సిర్పూర్ టి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించి కొనుగో లు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించా లని తెలిపారు.
మిల్లుకు వచ్చిన వాహనాల నుండి ధాన్యాన్ని తక్షణమే దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించే విధంగా సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారా వు, తహసిల్దార్ ప్రమోద్, ఐకెపి ఏపిఎం ముక్తేశ్వర్, రైతులు పాల్గొన్నారు.