15 March, 2026 | 8:32 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

18-11-2025 12:00 AM

ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు

నిజామాబాద్, నవంబర్ 17 (విజయ క్రాంతి):  గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి వేతనాలను పెంచి వారిని ఉద్యోగాల్లో పర్మినెంట్ చేయాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి ఎంపీడీవో కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కార్మికుల సమస్యల పరిష్కరించాలని, పీఎఫ్ ఈఎస్‌ఐ చట్టాల అమలు చేయాలని తన విజ్ఞాపన పత్రంలో ఆయన కోరారు,

కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆయన కోరారు. ప్రమాద బీమా 30 లక్షల కట్టాలని, జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, ఆన్లైన్లో ఎక్కనీ వారి పేర్లను ఎంట్రీ చేయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దేవన్న గ్రామపంచాయతీ నాయకులు షాపూర్ పోశెట్టి, భాస్కర్, ముత్యం ,లింగన్న రసూల్, సావిత్రి చిన్నయ్య, ఆశీర్వాదం, రషీద్ పాల్గొన్నారూ.