calender_icon.png 3 June, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేలో 16.4% పెరిగి స్థూల జీఎస్టీ వసూళ్లు

01-06-2025 09:05:58 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక గణాంకాల(Central Economic Statistics)ను ఆర్థిక మంత్రిత్వశాఖ(Ministry of Finance) ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది మేలో స్థూల జీఎస్టీ వసూల్లు రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మే 2024లో వసూలు చేసిన రూ.1.72 లక్షల కోట్లతో పోలిస్తే 16.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. వరుసగా రెండో నెలలోనూ జీఎస్టీ ఆదాయాలు రూ.2 లక్షల కోట్లకు పైన ఉండటం స్థిరమైన వినియోగ వృద్ధిని తెలుపుతుంది. ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు రూ.2.37 లక్షల కోట్లతో ఆల్ టైం గరిష్ఠాన్ని నమోదు కావడాన్ని మార్చితో పోలిస్తే 13 శాతం ఎక్కువ సూచిస్తుంది.

నికర జీఎస్టీ ఆదాయంలో గణనీయంగా 20 శాతానికి పైగా పెరిగిన  రీఫండ్ లు రూ.1.73 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయంగా జీఎస్టీ వసూళ్లు 13 శాతం పెరిగడంతో దిగుమతుల ఆదాయం 25.7 శాతం పెరిగింది. భారతదేశ మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి సంకేతాలను చూపుతోంది. మే 30న విడుదలైన డేటా ప్రకారం... 2024 ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి 6.5 శాతం లక్ష్యాన్ని సాధించింది. జనవరి నుండి మార్చి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం విస్తరించి మునుపటి మందగమనాల నుండి బలంగా పుంజుకుంది.

గత ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతం వృద్ధి చెందిన తర్వాత వినియోగం మళ్లీ పుంజుకుంది. మార్చిలో 6.9 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉన్న గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వినియోగ వస్తువుల ధరలు ఏప్రిల్ లో 6.4 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో ఉన్న రూ.2.10 లక్షల కోట్ల ఉన్న  జిఎస్టీ వసూళ్లు ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లకు పెరిగాడంతో 12.6 శాతం పెరిగింది.గత నెలలో జిఎస్టీ వసూళ్లు పెరగడానికి అధిక స్థాయి ఆర్థిక కార్యకలాపాలు కారణమని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.