12-02-2026 06:14:53 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): ఎల్లూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ నిధుల కింద మంజూరైన VO (విలేజ్ ఆర్గనైజేషన్) భవన నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చప్పిడే రవీందర్ ఆధ్వర్యంలో, MPDO ఆల్బట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
VO భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం గ్రామ మహిళా సంఘాలకు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుర్గం నారాయణ, వార్డు సభ్యులు సునీత, దామోదర్, అశోక్, చప్పిడే సత్యనారాయణ, కుకిడే రాజేశ్వర్, బాపు, శోభన్, శ్రీకాంత్, సిరిపురం భీమయ్య, సదశివ్, పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య, హౌసింగ్ AE, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమనందం, SA దుర్గం తులసిరాం, గ్రామస్థులు పాల్గొన్నారు.