17-10-2025 12:56:36 AM
-జోర్డాన్లో చిక్కుకున్న 12 మందికి
-ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హరీశ్రావు
-పెనాల్టీని స్వయంగా భరిస్తూ, విమాన టికెట్లు సైతం ఏర్పాటు
-మరో వారంలో సొంత గడ్డపై అడుగు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాం తి) : ‘బతుకుబండిని నడిపేందుకు, కుటుంబాలను పోషించేందుకు జోర్డాన్ వెళ్లాం. కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగొచ్చే మార్గమే కనిపించట్లేదు సార్, మమ్మల్ని కాపాడండి” అని పంపిన ఒక్క వాట్సప్ మెసేజ్ వారికి దారి చూపింది. బీఆర్ఎస్ పార్టీ రూపంలో తెలంగాణ చేరేందుకు బాటలు వేసింది. మాజీ మంత్రి హరీశ్రావు కృషితో గల్ఫ్లో చిక్కుకున్న కార్మికులు మరో వారంలో తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. దీంతో అక్క డ గల్ఫ్ కార్మికులు.. ఇక్కడ కుటుంబీకులు సంతోషిస్తున్నారు.
తెలంగాణ గల్ఫ్ కార్మికుల గోడును విన్న మాజీ మంత్రి హరీశ్ రావు కేసీఆర్ ఆదేశాలతో 12 మందిని ఎలాగైనా రప్పించాలని నిశ్చయించుకున్నారు. వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తన కార్యాలయానికి సూచించారు. 12 మందికి స్వ యంగా తానే ఫోన్ చేసి ‘ధైర్యంగా ఉండండి ఎట్లయినా మిమ్మల్ని తెలంగాణకు తీసుకొస్తాం’ అని భరోసా ఇచ్చారు. ఒకవైపు జో ర్డాన్ గల్ఫ్ కార్మికుల సమస్యను రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బం డి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకెళ్లిన హరీశ్ రావు, మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇంకోవైపు సంబంధిత కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చె ల్లించి, వారిని తెలంగాణకు తీసుకెళ్లొచ్చు అ ని కంపెనీ చెప్పగా దానికి అంగీకరించారు. చెల్లించాల్సిన మొత్తంతో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీశ్ రావు భరించారు. దీంతో విమాన టికెట్ల బుకింగ్ ప్రక్రియ సైతం పూర్తయింది. మరో వారంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట ప్రాం తాలకు చిందిన 12 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు.
త్వరలో స్వదేశానికి రాబోతున్నాం, కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నామని జోర్డాన్ లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు సంతోపడుతున్నారు. ఇందుకు ఎంతగానో కృషి చేసిన హరీశ్ రావుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే అభివృద్ధి, సంక్షేమం సమ ప్రాధాన్యంగా సాగిన కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ అయితే, రేవంత్రెడ్డి 22 నెలల పాలనలో వలసలు మల్లా మొదలయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.