పాకిస్థాన్లో ముష్కరుల కాల్పులు: 23 మంది మృతి
26-08-2024 12:35 PM
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ముష్కరులు రెచ్చిపోయారు. ముష్కరుల కాల్పుల్లో 23 మంది మృతి చెందారు. బలూచిస్థాన్- పంజాబ్ జాతీయరహదారిపై ముష్కరులు వాహనాలను ఆపారు. బస్సులు, ట్రక్కుల్లో వెళ్తున్న వారిని ముష్కరులు బలవంతంగా దింపారు. అక్కడితో ఆగకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 23 మంది చనిపోయారు. ముష్కరుల కాల్పుల్లో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో 19 మంది పాక్ పంజాబీలు, ముగ్గురు బలూచిస్థాన్ వాసులున్నట్లు గుర్తించారు. మృతుల్లో అధికంగా పాక్ పంజాబీ కూలీలు ఉన్నట్లు తెలిసింది. ముష్కరులు.. ప్రయాణికుల వర్గం ఆరా తీసినట్లు పాకిస్థాన్ అధికారి వెల్లడించారు.






