30 July, 2026 | 8:30 PM

Breaking News

పార్టీలకు అతీతంగా అభివృద్ధి   •   శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి   •   ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •  

నల్లబండగూడెం సాయి మందిరంలో కొనసాగుతున్న గురుపౌర్ణమి వేడుకలు

30-07-2026 07:35 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో రామాపురం క్రాస్ రోడ్డులో ఉన్న షిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయానికి సేవలు చేస్తున్న ఆలయ కమిటీ కోశాధికారి ఏదులాపురం శ్రీనివాస్‌ను సాయిమందిరం ఆవరణలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు సాయి శర్మ, గురుస్వామి శ్రీను, పూర్ణ, శ్యాం, నల్లపాటి ఆదినారాయణ, హేమంత్, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.