14 June, 2026 | 4:29 PM

Breaking News

ఆలయ నిర్మాణకు విరాళం అందజేత   •   ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •  

ఘనంగా బాలల దినోత్సవం

14-11-2025 07:37 PM

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ గ్రోవ్  పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం  బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ వేషాధారణలో అలరించారు. అనంతరం ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అని, అభం శుభం తెలియని ఆ పసి మనసులు ఉన్న పిల్లలు అంటే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎంతో ఇష్టపడే వారిని, అందుచేత ఆయన  పుట్టిన రోజునే ఏటా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు.